ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి..!

-

ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నిన్న తిరుపతి బాకారాపేట ఘాట్ రోడ్డు ప్రమాదం ఘటన మరిచిపోక ముందే ఇవాళ చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ రోడ్డు వద్ద రెండు లారీలు, ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ఘటనలో 8 మంది అక్కడికక్కడే మరణించారు.

 

మరో 40 మందికి గాయాలయ్యాయి. వారిలో కొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. సుమారు బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులున్నారు. పలమనేరు నుంచి చిత్తూరు వస్తున్నారు. గాయపడిన వారిలో పరువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడ్డ వారిని చిత్తూరు ఆసుపత్రికి, మరికొంత మందిని పలమనేరు హాస్పిటల్ కు తరలించారు. బస్సు టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో.. కంట్రోల్ కాక అదుపు తప్పి రాంగ్ రూట్ లో వెళ్లింది. దీంతో రెండు లారీలను ఢీ కొట్టింది బస్సు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రంగా గాయాలైన వారే అధికంగా ఉన్నట్టు సమాచారం. ఈ రోడ్డు ప్రమాదంతో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version