మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంట్లో మృతదేహం కేసులో ట్విస్ట్‌

-

నిజామాబాద్ జిల్లా : మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంట్లో దేవేందర్ అనే వ్యక్తి ఆత్మహత్యపై ఆర్మూర్ ఏసీపి ప్రభాకర్ రావు ఆసక్తి కర కామెంట్స్ చేశారు. తన వ్యక్తిగత కారణాల వల్లే దేవేందర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఆర్మూర్ ఏసీపి ప్రభాకర్ రావు వెల్లడించారు. సెల్ ఫోన్ ఆధారంగా పరిశీలిస్తే గత కొద్ది కాలంగా అతను ఓ మహిళ తో ప్రేమలో ఉన్నాడని చెప్పారు.

ఆ మహిళతో రాత్రి 12 గంటల వరకూ కూడా వాట్సప్ ఛాటింగ్ చేశాడు.. వారం రోజులుగా తన స్టేటస్ కూడా రిప్ అని పెట్టుకోవడం.. నిన్న రాత్రి నేను వెళ్తున్నా ప్రశాంతంగా ఉండూ అంటూ ఆమెతో ఛాట్ చేయడాన్ని బట్టి ప్రేమ వ్యవహారమే కారణంగా మా ప్రాథమిక విచారణలో తేలిందని స్పష్టం చేశారు. మృతుడు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంట్లో హౌజ్ కీపర్ గా పని చేస్తున్నాడు.. మరిన్ని వివరాలు ఇంకా మున్ముందు విచారణ లో తెలుతుందని వెల్లడించారు ఆర్మూర్ ఏసీపి ప్రభాకర్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news