సరూర్ నగర్ యువకుడి కిడ్నాప్ కేసులో ట్విస్ట్

-

హైదరాబాదులోని సరూర్ నగర్ లో యువకుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. పిఎన్టి కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం అనే యువకుడిని కొందరు గుర్తుతెలియని దుండగులు కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై వెంటనే సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నల్గొండ జిల్లా చింతపల్లి వద్ద కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ల నుంచి సుబ్రహ్మణ్యం ను రక్షించిన పోలీసులు.. నిందితులను విచారణ చేపట్టగా కీలక విషయాలు వెలుగు చూశాయి.

సుబ్రహ్మణ్యం తండ్రి వివాహేతర సంబంధం, ఆస్తితగాదాలే యువకుడికి కిడ్నాప్ కి కారణంగా పోలీసులు గుర్తించారు. యువకుడి కిడ్నాప్ వ్యవహారంలో గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డిది కీలక పాత్రగా పోలీసుల విచారణలో బయటపడింది. కార్పొరేటర్ తో పాటు మరో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news