హైదరాబాద్ లో దారుణం.. భ‌ర్త కుట్టిన బ్లౌజ్ న‌చ్చ‌లేద‌ని భార్య ఆత్మ‌హ‌త్య‌…

-

భర్త కుట్టిన బ్లౌజ్‌ నచ్చలేదని ఓ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన అంబర్‌పేట పోలీసు స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… .శ్రీనివాసులు, టి.విజయలక్ష్మి (35) లు గోల్నాక తిరుమలనగర్‌లో గత కొన్ని ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్త శ్రీనివాస్‌ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ చీరలు అమ్ముతూ ఉండేవాడు.

చీరలు అమ్మి ఇంటికి వచ్చిన అనంతరం.. ఇంట్లోనే కూడా టైలర్‌ పని చేస్తు ఉండే వాడు శ్రీనివాస్‌. ఈ తరుణంలోనే…. శనివారం రోజున తన భార్య కోసం.. ప్రేమతో జాకెట్‌ను కుట్టాడు శ్రీనివాస్‌. అయితే.. ఆ బ్లౌజ్‌ నచ్చలేదని… విజయలక్ష్మి భర్తతో గొడవ పెట్టుకుంది. అయితే.. నువ్వే కుట్టుకో పో.. అంటూ భార్య పై ఫైర్ అయ్యాడు ఆ శ్రీనివాస్‌. దీంతో ఆవేదనకు గురైన.. విజయ లక్ష్మి… బెడ్‌ రూంలోకి వెళి.. ఉరి వేసుకని ఆత్మహత్య చేసుకుంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news