ఆరు నెలలుగా తల్లి శవం పక్కనే.. చివరికి..!

-

సదరు మహిళకు ఉన్న ఒకే ఒక దిక్కు తల్లి.. ఇక చివరికి ఆ తల్లి కూడా మరణించడంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పడిపోయింది.. దీంతో కఠిన నిర్ణయం తీసుకొని తల్లి మరణ వార్త ఎవరికీ తెలియకుండా దాచింది… ఇక తల్లి శవం తోనే ఆరునెలలుగా జీవితం గడుపుతోంది. అయితే గత ఆరునెలల నుంచి తల్లి కనీసం ఆచూకీ లేకుండా కనిపించకపోవడంతో స్థానికులు అనుమానం వచ్చి ఇంట్లో గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం కాస్త బయటపడింది. ఈ ఘటన ముంబై లో చోటుచేసుకుంది.

dead body

ముంబైలోని బాంద్రా ప్రాంతానికి చెందిన తల్లి కూతుర్లు ఒక ఇంట్లో ఉండేవారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఈ క్రమంలోనే ఉన్నఫలంగా అనారోగ్యం బారిన పడ తల్లి మృతి చెందింది. దీంతో ఏం చేయాలో సదరు మహిళకు తోచలేదు. చివరికి తల్లి శవం తోనే ఆరు నెలల నుంచి జీవించడం మొదలు పెట్టింది. స్థానికుల సమాచారంతో సదరు మహిళ ఇంటికి వెళ్లి పోలీసులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది… కాగా మానసిక సమస్యలతో బాధపడుతున్న సదరు మహిళను ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news