ఏపీలో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య..ఓ అమ్మాయి వేధింపులే కారణమంటూ !

-

ఏపీలో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ అమ్మాయి వేధింపులే కారణమంటూ సూసైడ్‌ నోట్‌ కూడా రాశాడు. ఈ సంఘటన కృష్ణ జిల్లాలో చోటు చేసుకుంది. మిస్ యూ అల్ అంటూ బందరు వాసి హైద్రాబాద్ లో సూసైడ్ చేసుకున్నాడు ఆ యువకుడు. ఓ అమ్మాయి వేధింపులే తన చావుకి కారణం అంటూ సూసైడ్ నోట్ రాశాడు.

ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ యువకుడు. అవసరానికి డబ్బులిస్తే ప్రైవేట్ రిలేషన్ షిప్ లో ఉందాం అన్న యువతి… తిరిగి డబ్బులడిగితే అతనిపై అలాగే అతని కుటుంబంపై కేసు పెట్టడంతతో యువకుడు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. నా వల్ల నా కుటుంబం ఇబ్బంది పడకూడదు అనే, ఈ నిర్ణయం తీసుకున్న అంటూ సూసైడ్ నోట్..రాశి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అటు తమ కుమారుడుది ఆత్మహత్య కాదంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news