ఫొటోగ్రాఫర్ అవ‌తారం ఎత్తిన డివిలియ‌ర్స్‌.. విరాట్‌కోహ్లి, అనుష్క శ‌ర్మ‌లను కెమెరాలో బంధించాడు..!

-

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020లో భాగంగా మ్యాచ్‌ల‌ను ఆడుతున్న రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఆట‌గాళ్ల‌కు కాసింత విరామం ల‌భించింది. దీంతో ఆట‌గాళ్లు కొంత సేపు స్విమ్మింగ్ పూల్‌లో సేద‌దీరారు. ఈ క్ర‌మంలోనే కోహ్లితోపాటు దుబాయ్‌లో ఉన్న అనుష్క శ‌ర్మ అత‌నితో క‌లిసి కాసేపు పూల్‌లో గ‌డిపింది. అయితే అదే స‌మయంలో వారిద్ద‌రికీ చెందిన ఓ రొమాంటిక్ పిక్‌ను బెంగ‌ళూరు ఆట‌గాడు ఏబీ డివిలియ‌ర్స్ కెమెరాలో బంధించాడు. ఆ ఫొటో చాలా అద్భుతంగా రావ‌డం విశేషం.

ab devilliers captured photo of kohli and anushka sharma

త‌మ ఫొటోను తీసినందుకు గాను కోహ్లి.. డివిలియ‌ర్స్‌కు క్రెడిట్స్ ఇచ్చాడు. దాన్ని కోహ్లి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ క్ర‌మంలో కోహ్లి, అనుష్క శ‌ర్మ‌ల‌కు చెందిన ఆ ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దానికి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. అంత అద్భుతంగా డివిలియ‌ర్స్ ఫొటో తీసినందుకు అత‌న్ని ప్ర‌శంసిస్తున్నారు. ఏబీ డివిలియ‌ర్స్ సిక్స్‌లు బాద‌డంలోనే కాదు, ఫొటోల‌ను తీయ‌డంలోనూ ఎక్స్‌ప‌ర్ట్ అని కొనియాడుతున్నారు.

కాగా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌న చివ‌రి మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై గెలుపొందింది. ఐపీఎల్ 2020 పాయింట్ల ప‌ట్టిక‌లో బెంగ‌ళూరు ప్ర‌స్తుతం 3వ స్థానంలో ఉంది. మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు 6 మ్యాచ్‌ల‌లో గెలిచింది. ఈ నెల 21న బెంగ‌ళూరు త‌న త‌దుప‌రి మ్యాచ్‌లో కోల్‌క‌తాతో అబుధాబిలో త‌ల‌ప‌డ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news