BREAKING : కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు ఎత్తివేత

-

న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లోని సీట్ల కోటపై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది మోడీ సర్కార్. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు ఎత్తివేస్తూ కీలక ప్రకటన చేసింది.

తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎంపీ కోటా సీట్లు ఉండవని కేంద్రీయ విద్యాలయాల ప్రిన్సిపాల్స్ కి ఆదేశాలు జారీ చేసింది కేంద్ర సర్కార్. పార్ట్ వన్ ఆఫ్ పార్ట్ బి గైడ్ లైన్స్ ప్రకారం… కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది.  ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర విద్యా శాఖ. ఈ ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలసిందేనని స్పష్టం చేసింది. కాగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ని అడ్మిషన్ల కు సంబంధించి నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది.. మార్చి 21వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ఈ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. ఇందులో దరఖాస్తు చేసుకునేందుకు ఈ https://kvsangathan.nic.in/ వెబ్ సైట్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news