Chiranjeevi : ‘ఆచార్య’ ఓటీటీ డేట్ ఫిక్స్..

-

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆచార్య. ఇక ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే మొదటి షో కే ఈ సినిమా నెగిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో ప్రతి ఒక్కరు దర్శకుడు కొరటాల శివ పై ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా పూజాహెగ్డే నటించగా.. ఇక మెగాస్టార్ కు జోడిగా త్రిషను అనుకున్నారు.

కానీ ఆమె ఈ సినిమా నుంచి తప్పుకొంది. ఆ తర్వాత కాజల్ ని కూడా అనుకున్నారు. తగ్గట్టుగానే లాహే లాహే పాటను కూడా చిత్రీకరించడం జరిగింది. ట్రైలర్ విడుదల అయ్యే వరకు కూడా కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో ఉందని అందరూ అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి దర్శకుడు కథ మార్చడంతో ఆమెను కూడా ఈ సినిమా నుంచి తీసివేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ ను అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. మే 20 వ తేదీన ఆచార్య సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌ లో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Latest news