వైసిపి నేతల ఆగడాలకు భయపడం – అచ్చెన్నాయుడు

-

వైసీపీ నేతల ఆగడాలకు భయపడే ప్రసక్తే లేదన్నారు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అండతోనే ఇసుక మాఫియా చెలరేగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత నరేంద్రపై వైసీపీ శాండ్ మాఫియా దాడి అమానుషం అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నేతల అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలోని సహజ వనరులను దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా? అంటూ నిలదీశారు. దాడిపై నరేంద్ర ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు? అని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. అధికార పార్టీ కోసమే పోలీసులు పని చేస్తారా..? వైసీపీ నేతల ఆగడాలకు భయపడం అన్నారు. జగన్ అరాచక పాలనపై మా పోరాటం ఆగదన్నారు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news