సహజీవనానికి నో చెప్పాడని… ప్రియుడిపై యాసిడ్ దాడి..

-

ప్రేమకు నో చెప్పారని.. పెళ్లికి ఎస్ చెప్పలేదని యువతులపై యాసిడ్ దాడులు చేసిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. కానీ ఈ మధ్య యువకులపై దాడులు కూడా జరుగుతున్నాయి. ఇటీవల తనను వదిలివేస్తున్నాడని కేరళలో ఓ యువతి..యువకుడిపై యాసిడ్ దాడి చేసిన ఘటన మరవక ముందే.. ఇలాంటి సంఘటనే తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ లో చోటు చేసుకుంది. తనలో సహజీవననానికి ’నో‘ చెబుతున్నాడని ఓ యువతి.. యువకుడిపై యాసిడ్ దాడి చేసింది.

వివరాల్లోకి వెళితే… తమిళనాడు కోయంబత్తూర్ కు చెందిన జయంతి(27), కేరళకు చెందిన రాకేష్(30) గత కొన్ని నెలలుగా ఓ అపార్ట్మెంట్ లో సహజీవనం చేస్తున్నారు. ఇటీవల కేరళలో సొంతూరుకు వెళ్లిన రాకేష్ తిరిగి వచ్చిన తర్వాత జయంతితో సంబంధాన్ని తెంచుకునేందుకు ప్రయత్నించాడు.. తనకు కేరళలో వేరే అమ్మాయితో పెళ్లైందని చెప్పాడు. దీంతో కోపోద్రిక్తురాలు అయిన జయంతి రాకేష్ పై యాసిడ్ తో దాడి చేసింది. తరువాత భయపడిన జయంతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.దీనిపై సమాచారం అందుకున్న పీలమేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. జయంతిపై 323, 324, 326(ఏ) సెక్షన్ల కింద, రాజేశ్​పై 417, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news