విషం కలిపి..నన్ను చంపాలని ప్లాన్ వేశారు – బాబు మోహన్ సంచలనం

-

తనకు విషం పెట్టి కొంతమంది చంపాలనుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బిజెపి నేత, టాలీవుడ్ నటుడు బాబు మోహన్. బాబు మోహన్ సినిమాలతో పాటు ఫుల్ బిజీగా ఉన్న టైంలోనే టిడిపిలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ సమయంలో తనకు జరిగిన ఓ చేదు సంఘటన గురించి ఆయన పంచుకున్నారు. వన్స్ మోర్ అనే సినిమా షూటింగ్ సమయంలో తనికెళ్ల భరణి ఒకటి పాన్ ఇచ్చి తనను రుచి చూడమని చెప్పారని.. అది నోట్లో పెట్టుకుని తాను వెంటనే ఛీ.. ఛీ అంటూ ఊదేశానని తెలిపారు.

అయితే ఆ తర్వాత విచిత్రంగా తనకు పాన్ తినడం అలవాటైపోయిందన్నారు. సంగారెడ్డి లో ఉన్న ఓ పాన్ డబ్బాలో తాను ఎప్పుడూ పాన్ తినేవాడినని చెప్పారు బాబు మోహన్. ఆ డబ్బాలో నేను నిత్యం పాన్ తీసుకుంటున్నట్లు కొందరు తెలుసుకుని.. నన్ను చంపాలనీ అనుకున్నారు. ఒకరోజు పాన్ తీసుకున్న తర్వాత ఓ మహిళ నాకు ఫోన్ చేసింది. ఆఫ్ పాన్ తినకండి అని ఆమె చెప్పింది. వెంటనే దాన్ని పడేసాను. కాసేపటి తర్వాత మళ్ళీ ఆమె ఫోన్ చేసింది. ఆమె ఎవరో కాదు నాకు పాన్ కట్టించిన వ్యక్తి భార్యనే. కొందరు వ్యక్తులు బెదిరించడంతో పాన్ లో విషయం కలిపినట్లు చెప్పింది అంటూ బాబు మోహన్ వెల్లడించారు. అయితే దీని వెనుక ఎవరు ఉన్నారు అనే దానిపై ఇంకా తనకు విషయాలు తెలియదని… చెప్పారు బాబు మోహన్. తగా ప్రస్తుతం బాబు మోహన్ బిజెపి పార్టీలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news