బుల్లితెర షో కి ఎంట్రీ ఇచ్చిన ఖుష్బూ..!

-

తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షో ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుచేత అంటే ఈ షో దాదాపుగా వచ్చి 9 సంవత్సరాలు పైనే అవుతుంది. గడిచిన కొన్ని నెలల క్రిందటి వరకు ఈ షో మొదటి స్థానంలోనే ఉన్నది. కానీ ఇందులో జడ్జిలు, ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా విడిపోతూ ఉండడంతో ఈ షో రేటింగ్ చాలా పడిపోయిందని చెప్పవచ్చు. అలా బయటికి వచ్చిన కంటిస్టెంట్లు ఎందుకు వెళ్లిపోయారో కూడా తెలియజేయలేదు. పలు రకాలుగా ఈ షోలో మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా అలనాటి హీరోయిన్ ఈ షో కి ఎంట్రీ ఇచ్చింది వాటి గురించి చూద్దాం.

ఇందులో రోజా జడ్జిగా ఉన్నప్పుడు నాగబాబు ఉండేవారు కానీ నాగబాబు కొన్ని కారణాలు చేత ఈ షోని వీడిపోవడంతో.. నాగబాబు ప్లేసులో సింగర్ మనో రావడం జరిగింది. అయితే రోజా కూడా మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ గుడ్ బై చెప్పేసింది దాంతో సింగర్ మనో కూడా వదిలేయడం జరిగింది. దీంతో రోజా స్థానంలో హీరోయిన్ ఇంద్రజ రావడం జరిగింది కానీ ఈమె అంతగా ఆకట్టుకోలేక పోతోంది. ఇక ఈమె ఇదివరకే శ్రీదేవి వంటి డ్రామా కంపెనీలు జడ్జిగా వ్యవహరిస్తున్నది.

దీంతో మల్లెమాలవారు ఇప్పుడు తాజాగా నటి ఖుష్బూని జబర్దస్త్ షోలోకి తీసుకురావడం జరిగింది. అందుకు సంబంధించి ఒక ప్రోమో కూడా ఇప్పుడు విడుదల అయింది. ప్రస్తుతం ఈ ప్రోమోలో పంచ్ డైలాగులు కూడా చాలా వైరల్ గా మారుతున్నాయి. ఖుష్బూ గతంలో కంటే ఇప్పుడు ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్నది. మరి ఈ షో లో ఎంతవరకు ఖుష్బూ అలరిస్తుందో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారుతూ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news