బ్రేకింగ్ : నటుడు శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్

-

మొదటి కరోనా వైరస్ కేసు వెలుగులోకి వచ్చే ఏడాది దాటుతున్నా ఇంకా కరోనా వైరస్ విజృంభణ తగ్గడంలేదు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ పలు దశలలో ఉండగా ఫైజర్ వ్యాక్సిన్ ని యునైటెడ్ కింగ్డమ్ అలాగే అమెరికాలో పంపిణీ కూడా మొదలు పెట్టారు. అయినా సరే కరోనా వైరస్ కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన భార్య ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ తన సోషల్ మీడియా ద్వారా ఈ అంశం ప్రకటించారు.

ఈరోజు “శరత్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది అయితే ఆయనకు ఎటువంటి లక్షణాలూ కనిపించలేదు కానీ ముందు జాగ్రత్తగా ఆయన మంచి డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తాం అని పేర్కొంటూ ట్వీట్ చేసింది. ఇదే విషయాన్ని ఆయన కుమార్తె ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ప్రకటించారు. తన తండ్రి శరత్ కుమార్ కి కరోనా వైరస్ ఉందని ఆయన ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నారని ఆయన ప్రస్తుతం డాక్టరు పర్యవేక్షణలో కోలుకుంటున్నారని ఆమె పేర్కొంది.. తెలుగు లో రిలీజ్ అయిన కాంచన సినిమా లో ఈయన హిజ్రా పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

Read more RELATED
Recommended to you

Latest news