FLASH : తమన్నా తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్..!

-

ప్రముఖ సినీ నటి తమన్నా తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తమన్నా స్వయంగా వెల్లడించింది. కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. అందులో వారికీ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు తెలిపింది. అయితే తనతో పాటు ఇతర కుటుంబసభ్యులకు కరోనా నెగెటివ్ వచ్చిందని తమన్నా తెలిపింది. మీ అందరి ప్రేమాభిమానాలతో వారు త్వరగా కోలుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

ఇప్పటికే అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ నుంచి రాజమౌళి కుటుంబం వరకు అందరు దీని బారిన పడ్డారు. ఆ తర్వాత  అమితాబ్ బచ్చన్, రాజమౌళి కుటుంబ సభ్యులందరు కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా ఆయన చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version