అక్ర‌మ సంబంధానికి అల‌వాటు ప‌డి.. భ‌ర్త‌నే హ‌త్య

-

ఒక మ‌హిళ‌ భ‌ర్త ఉండగానే అక్ర‌మ సంబంధానికి అల‌వాటు ప‌డింది. త‌ర‌చూ త‌న పెళ్లి కాని ప్రియుడితో శారీర‌కంగా క‌లిసేది. ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నా.. వివాహేత‌ర సంబంధాన్ని వ‌దులు కోలేదు. అయితే ఆ మ‌హిళ అక్రమ సంబంధం గురించి తెలిసిన భ‌ర్త‌.. మంద‌లించాడు. త‌న ప్రియుడితో క‌లవ‌డాని త‌ప్పుబ‌ట్టాడు. దీంతో ఆ మ‌హిళ‌, ప్రియుడితో క‌లిసి సొంత భ‌ర్త హ‌త్య చేసింది. ఈ దారుణ మైన ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని త‌మ‌కూర్ లో చోటు చేసుకుంది. రాజు (34), మీనా ఇద్ద‌రు భార్య భ‌ర్తలు. వీరికి వివాహం జ‌రిగి ఎనిమిదేళ్లు అవుతుంది. ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు.

భార్య మీనా.. ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నా రాకేష్ అనే యువ‌కుడితో ప్రేమలో ప‌డింది. రాకేష్ ఒక ప్ర‌యివేట్ కాలేజీలో డిగ్రీ చ‌దువుతున్నాడు. మీనా టైల‌ర్ కావ‌డంతో ఎదో ఒక ప‌ని చెప్పి వ‌స్తూ ఉండేవాడు. ఇలా వారి మ‌ధ్య అక్ర‌మ సంబంధానికి దారి తీసింది. ఇలా కొద్ది రోజుల మీనా, రాకేష్ క‌లుస్తుండేవారు. ఒక్క రోజు వీరి వ్య‌వ‌హారం రాజుకు తెలిసింది. మీనా ను మంద‌లించాడు. దీంతో మీనా, రాకేష్.. ప‌న్నాగం వేశారు. త‌మ‌కు అడ్డుగా ఉన్న రాజును చంపాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

రాజుకు రాకేష్ పార్టీ అని పిలిచి.. మ‌ద్యం బాగా తాగించాడు. త‌ర్వాత మీనా, రాకేష్ ఇద్ద‌రు క‌లిసి బండ‌రాయితో బ‌లంగా కొట్టి చంపారు. అనంత‌రం పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో.. ఈ కేసు పై ద‌ర్యాప్తు జ‌రిపారు. భార్య‌పై అనుమానం వ‌చ్చి విచార‌ణ చేయ‌గా.. అస‌లు నిజం బ‌య‌టకు వ‌చ్చింది. దీంతో రాకేష్, మీనాల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news