శర్వా పక్కన అదితి.. మహాసముద్రం మరింత ఆసక్తికరం..

-

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న శర్వానంద్ వరుసగా సినిమాలని ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు చేస్తున్న శ్రీకారం సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే చేతిలో మరో మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. కరోనా కారణంగా నిలిచిపోయిన శ్రీకారం షూటింగ్ ఈ మధ్యే మళ్ళీ మొదలైంది. ఐతే ఈ సినిమా అనంతరం శర్వానంద్, ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మహాసముద్రం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ తో పాటు హీరో సిద్ధార్థ కూడా నటిస్తున్నాడు. ఈ మేరకు అధికారిక సమాచారం వచ్చింది కూడా. అయితే ఈ సినిమాలో శర్వా సరసన హీరోయిన్ గా సమ్మోహనం బ్యూటీ అదితీ రావ్ హైదరీని తీసుకున్నారు. హీరోయిన్ పాత్రకి మంచి ఇంపార్టెన్స్ ఉండడంతో అదితీ రావ్ ని ఎంచుకున్నారట. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాని రామబ్రహ్మం సుంకర్ నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news