థియేటర్‌లోకి మళ్లీ భట్టు-చారీలు .. అదుర్స్ రీ రిలీజ్ డేట్ ఫిక్స్

-

జూ.ఎన్టీఆర్‌ అభిమానులకు గుడ్ న్యూస్. తారక్ కెరీర్ లోనే సూపర్ హిట్ గా నిలిచిన అదుర్స్ సినిమా అంటే అభిమానులకు మామూలు క్రేజ్ కాదు. తారక్ సినీ కెరీర్ లోనే అదుర్స్ ఓ సెన్సేషన్. ఈ మూవీలో భట్టు-చారీల కాంబోకు ఉన్న క్రేజే వేరు. ఇక సోషల్ మీడియాలో ప్రతీ మీమ్ లో ఈ క్యారెక్టర్లు ఉండాల్సిందే. ఇంతటి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాను త్వరలో రీ రిలీజ్ చేయబోతున్నారు.

మార్చి 4న 4 కె ప్రింట్‌తో అదుర్స్‌ మూవీని రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రీ-రిలీజ్‌కు సంబంధించిన పనులు కూడా స్టార్‌ అయిపోయాయి. కాగా మార్చి తొలివారంలో చెప్పుకోదగ్గ సినిమాలేవి రిలీజ్‌ కావడం లేదు. దాంతో అదుర్స్‌కు మంచి కలెక్షన్‌లు వచ్చే చాన్స్ ఉంది. ఇక గతంలో ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందంటూ ప్రచారం వచ్చినా.. వివి వినాయక్‌ ఆసక్తి కనబరచలేదని సమాచారం. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్‌లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news