284 పరుగులకు ఆఫ్ఘన్ ఆలౌట్

-

ఐసీసీ ప్రపంచకప్ టోర్నమెంట్-2023లో భాగంగా ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ముంగిట ఆప్ఘనిస్థాన్ 285 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది. తొలుత టాస్ కోల్పోయిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 49.5 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ 80, ఇబ్రహీం జాడ్రన్ 28, ఇక్రం అలిఖిల్ 58, ముజీం ఉర్ రెహ్మాన్ 28 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు అదిల్ రషీద్ మూడు, మార్క్ వుడ్ 2, లియాం లివింగ్ స్టోన్, జాయ్ రూట్, రీసీ టోప్లే చెరో వికెట్ తీశారు.

ఓ దశలో ఆఫ్ఘన్ జట్టుకు భారీ స్కోరు చేసే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. తొలి వికెట్ కు కేవలం 16.4 ఓవర్లలోనే 114 పరుగులు జోడించడం ద్వారా ఆఫ్ఘన్ ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జాద్రాన్ పటిష్టమైన పునాది వేశారు. ధాటిగా ఆడిన గుర్బాజ్ 57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 80 పరుగులు చేయగా, ఇబ్రహీం జాద్రాన్ 28 పరుగులతో అండగా నిలిచాడు.
అయితే, ఇతర టాపార్డర్ బ్యాట్స్ మెన్ వైఫల్యంతో 300 లోపు స్కోరుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

రహ్మద్ షా (3), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (14), అజ్మతుల్లా ఒమర్జాయ్ (19) ఆకట్టుకోలేకపోయారు. మిడిలార్డర్ లో ఇక్రమ్ అలీఖిల్ ఇంగ్లండ్ బౌలింగ్ దాడులను సమర్థంగా ఎదుర్కొని అర్ధసెంచరీతో మెరిశాడు. అలీఖిల్ 66 బంతులోల్ 3 ఫోర్లు, 2 సిక్సులతో 58 పరుగులు చేసి రీస్ టాప్లే బౌలింగ్ లో అవుటయ్యాడు. రషీద్ ఖాన్ 23, ముజీబ్ ఉర్ రెహమాన్ 28 పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ 3 వికెట్లు తీయగా, స్పీడ్ స్టర్ మార్క్ ఉడ్ 2, రీస్ టాప్లే 1, లియామ్ లివింగ్ స్టన్ 1, జో రూట్ 1 వికెట్ పడగొట్టారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news