వీడియో వైరల్: కచ్చా బాదం పాట తరవాత.. జామకాయలు అమ్మే వ్యక్తి పాట వైరల్..!

-

కచ్చా బాదం పాట సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో మనం చూశాం. ఇప్పుడు జామ కాయలు అమ్మే వ్యక్తి పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. 27 సెకన్ల వీడియోని యూట్యూబ్ లో జామకాయ అమ్మే వ్యక్తి పెట్టాడు. ”ఏ హరి హరి కచ్చి కచ్చి పీలి పీలి పక్కి పక్కి..” అంటూ జామ కాయల కోసం జామకాయలను అమ్మే తాత పాడాడు.

 

అయితే ఇది కాస్త కచ్చా బాదం పాట తరహాలోనే వుంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలంటే ఎంతో కాలం పట్టడం లేదు. కాస్త వెరైటీగా ఉన్నా లేదా కొంచెం టాలెంట్ ఉన్నా వెంటనే ఫేమస్ అయిపోతున్నారు. అయితే ఇప్పుడు పాట పాడిన అతని గురించి పెద్దగా వివరాలు తెలియవు.

ఎక్కడి నుంచి వచ్చాడు అనేది కూడా తెలియదు. గతంలో భువన్ అనే వ్యక్తి పల్లీలు అమ్ముతూ పాట పాడాడు. యూట్యూబ్ లో ఈ పాటకి 50 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మొదట్లో అతన్ని చాలా మంది ఏడిపించేవారు కానీ కచ్చ బాదం తర్వాత అతను ఒక సెలబ్రిటీ అయిపోయాడు.

చాలా మంది తన దగ్గరకు వచ్చే సెల్ఫీ కూడా తీసుకుంటానని అంటున్నారు అని చెప్పాడు. అయితే మరి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన జామకాయలు అమ్మే వ్యక్తి పాట కోసం కూడా చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news