ఏజెంట్ ఆత్రేయ దర్శకుడి రెండో చిత్రానికి ఆదిలోనే తాకిన సెగ..

-

గత ఏడాది విడుదలైన చిన్న సినిమాలన్నింటిలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ గురించి అందరికీ తెలిసిందే. నవీన్ పోలిశెట్టి హీరోగా పరిచయమైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. కొత్త దర్శకుడు స్వరూప్ ఆర్ ఎస్ జే కి ఈ సినిమాతో మంచి ప్రశంసలు దక్కాయి. ప్రేక్షకులతో పాటు అటు విమర్శకుల నుండి మంచి స్పందన రావడంతో స్వరూప్ ఆర్ ఎస్ జే అందరి దృష్టిలో పడ్డాడు.

ఐతే ఈ దర్శకుడు తన రెండవ సినిమాని ఈ మధ్యే ప్రకటించాడు. మొదటి సినిమాతో సాలిడ్ హింట్ అందుకున్న స్వరూప్, రెండవ సినిమాని చైల్డ్ ఆర్టిస్టులతో తెరకెక్కిస్తుండడం విశేషం. మిషన్ ఇంపాజిబుల్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్ ఇటీవలే విడుదలైంది. చేతుల్లో తుపాకులతో ముగ్గురు చైల్డ్ ఆర్టిస్టులు ఆంజనేయ, శివుడ్, క్రిష్ణుడి గెటప్పుల్లో కనిపించారు. ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది. దేవుడి గెటప్ వేసి, చేతిలో తుపాకీ పెట్టడం ఏంటని సోషల్ మీడియాలో వ్యతిరేకత వచ్చింది. దాంతో దిగి వచ్చిన నిర్మాతలు ఆ పోస్టర్ ని వెనక్కి తీసుకుంటున్నాం అని వెల్లడి చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news