వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇంటి బయట ఆందోళన

-

తెలుగు రాష్ట్రాలలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే వైసీపీ నేతలు దేవినేని అవినాష్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇళ్లలో ఐటి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వంశీ రామ్ బిల్డర్స్ పై తనిఖీలలో భాగంగానే వైసిపి నేతల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో వైసీపీ నేత దేవినేని అవినాష్ కు చెందిన స్థలం డెవలప్మెంట్ కోసం వంశీరాం బిల్డర్స్ తీసుకుంది.

ఒప్పందంలో భాగంగా జరిగిన లావాదేవీల పై ఐటి అధికారులు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. అయితే దేవినేని అనుచరులు మాత్రం దాడులకు వ్యతిరేకంగా ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కక్షపూరితంగానే అవినాష్ ఇంటిపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఐటీ అధికారులు వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అవినాష్ ఇంట్లో ఐటీ అధికారులు పలు హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news