Janhvi Kapoor : అక్కినేని హీరోతో జాన్వీ కపూర్ రొమాన్స్

-

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన అందాల భామ జాన్వీ కపూర్‌. అలాగే శ్రీదేవి అందంతో పాటు అభినయాన్ని కూడా పునికిపుచ్చుకున్న ఈ భామ తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించింది. `దడక్‌` సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ నిర్మించారు.

ఈ సినిమా మరాఠిలో సూపర్ హిట్ అయిన ‘సైరాత్‌’కు రీమేక్‌గా వచ్చింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. అయితే తాజాగా… జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్త నిన్నటి నుంచి హల్ చల్ చేస్తోంది.

నిర్మాత కరణ్‌ జోహర్‌, అక్కినేని అఖిల్‌ కాంబోలో ఓ పాన్‌ ఇండియాలో మూవీ తెరకెక్క బోతుంది. ప్రస్తుతం అఖిల్‌ ఏజెంట్‌ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తికాగానే.. కరణ్‌ జోహర్‌ సినిమా చేస్తారు. అయితే.. ఇందులో అఖిల్‌ సరసన జాన్వీ కపూర్‌ చేయనుందని సమాచారం అందుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news