Nagarjuna: కొడుకు కోసం క‌ష్ట‌ప‌డుతున్న కింగ్ నాగ్! అస‌లేం జ‌రుగుతుందంటే!

-

Nagarjuna: సినీ ఇండస్ట్రీలోని సీనియర్ హీరోలు చాలా మంది త‌మ వార‌సుల‌ను హీరోలుగా ప‌రిచ‌యం చేశారు. మ‌రికొంద‌రు ఇంక ప‌రిచ‌యం చేస్తునే ఉన్నారు. అయితే.. వారిలో కొందరు మంది విజ‌యం సాధించి.. టాప్ హీరోలుగా కొన‌సాగుతున్నారు. మ‌రికొంద‌రూ త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. అలాంటి వారిలో అక్కినేని నాగ్‌ వార‌సుడు అఖిల్ అక్కినేని ఒకడు.

ఇండ‌స్ట్రీకి వ‌చ్చి చాలా రోజులైనా.. స‌రైనా స‌క్సెస్ అందుకోలేదు. స‌క్సెస్ కోసం వేచి చూస్తోన్న అక్కినేని అఖిల్.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాతో అఖిల్ క‌చ్చితంగా సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అయితే.. తాజాగా టాలీవుడ్ లో ఓ టాక్ విపరీతంగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాను స‌క్సెస్ చేయ‌డానికి కింగ్ నాగ్ కూడా రంగంలో దిగడంట‌. ఈ సినిమాతో తన కుమారుడు అఖిల్‌కు బిగ్ హిట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాడట కింగ్ నాగ్.

ఇందుకోసం ఆయనే స్వ‌యంగా రంగంలోకి దిగి.. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షించాడని తెలిసింది. అంతేకాదు, ఈ సినిమా కోసం నాగార్జున కత్తెర పట్టాడ‌ని, కొన్ని సీన్స్‌ను ఎడిట్ చేయల‌ని, అవ‌స‌ర‌మైతే.. రీ షూట్ చేయాల‌ని సూచించార‌నే టాక్ వినిపిస్తోంది. గతంలోనూ ఆయన పలు చిత్రాలకు ఇలాగే వ్యవహరించారు. అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు అఖిల్ మూవీ కూడా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు.

ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీని అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగ‌వంతం చేసింది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన‌ పోస్టర్లు, పాటలు, టీజర్‌, ట్రైల‌ర్ల ను భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది అత్యధిక వ్యూస్‌ను సైతం సొంతం చేసుకుంది.

అఖిల్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే న‌టిస్తుంది. ఈచిత్రం అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఏ మేర‌కు విజ‌యం సాధిస్తుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news