హైదరాబాద్ ప్రయాణికులకు అలర్ట్..నేడు, రేపు పలు MMTS రైళ్లు రద్దు కానున్నాయి. నేడు(శనివారం), రేపు(ఆదివారం) పలు MMTS రైళ్లు, 4 డెమో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన చేసింది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/05/Alert-for-Hyderabad-commuters-Many-MMTS-trains-will-be-canceled-today-and-tomorrow.webp)
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు సంబంధించిన ఆధునీకరణ పనులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల లాంటి నిర్మాణ పనుల వల్ల పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఇక ఇందులో SEC–ఫలక్నుమా, మేడ్చల్–SEC, లింగంపల్లి–మేడ్చల్, HYD–మేడ్చల్ మధ్య సేవలందించే 22 MMTS సర్వీసులు ఉన్నాయి. దీంతో హైదరాబాద్ ప్రయాణికులు…ప్రయాణాలకు.. ఇతర మార్గాలను ఎంచుకోవాలని రైల్వే శాఖ కోరింది.