BREAKING : విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. సెక్షన్ 30 అమలు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించ తలపెట్టారు.

మరో రెండు రోజుల్లో విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉండటంతో బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద కార్మిక సంఘాలు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన పోలీసులు కార్మికులను అరెస్టు చేశారు. అటు విశాఖలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ను అమలు చేస్తున్నారు పోలీసులు. దీంతో  విశాఖలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news