ఎస్బీఐ ఖాతాదారుల‌కు అల‌ర్ట్‌.. ఆ స‌మ‌యాల్లో సేవ‌లకు అంత‌రాయం

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) త‌న ఖాతాదారుల‌న అల‌ర్ట్ చేసింది. బ్యాంకుకు సంబంధించి క‌స్ట‌మ‌ర్ల‌కు కొన్ని సేవ‌ల్లో అంత‌రాయం క‌లుగుతుంద‌ని తెలిపింది. ఈ బ్యాంకుకు అన్ని బ్యాంకుల కంటే క‌స్ట‌మ‌ర్ల చాలా ఎక్కువ‌. దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ బ్యాంకుల్లో ఇదే మొద‌టి స్థానంలో ఉంటుంద‌న‌డంలో ఎలాంటి ఆశ్చ‌ర్యం లేదు.

మ‌రి అలాంటి బ్యాంకులో ఇప్పుడు కొన్ని సేవ‌ల‌కు అంత‌రాయం క‌ల‌గ‌నుంది. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఎస్బీఐ వివ‌రించింది. ఆ మేర‌కు క‌స్ట‌మ‌ర్ల‌ను అల‌ర్ట్ చేసింది.

మే7వ తేదీ అన‌గా ఈ రోజు రాత్రి 10.15 గంటల నుంచి 8వ తేదీ అర్థరాత్రి 1.45 గంటల వరకు ప‌లు సేవ‌లు నిలిచిపోనున్న‌ట్టు తెలిపింది. ముఖ్యంగా నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ ఇత‌ర సేవల‌కు అంత‌రాయం క‌లుగుతుంద‌ని తెలిపింది. దాదాపు మూడున్నర గంటలు పైన ఈ సేవ‌లు ప‌నిచేయ‌వు. కాబ‌ట్టి క‌స్ట‌మ‌ర్లు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని ఎస్బీఐ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది.

Read more RELATED
Recommended to you

Latest news