ENTRANCE EXAMS : ఏపీలో కామన్ ఎంట్రెన్స్ పరీక్షల షెడ్యూల్ ఖరారు

-

ఏపీలో కామన్ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ ను జగన్ సర్కార్ ఖరారు చేసింది. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది. ఆయా పరీక్షల నిర్వహణకు చైర్మన్, కన్వీనర్లను నియమించిన తర్వాత ఈ వివరాలను విడుదల చేశారు. ఏపీ సర్కార్ నిర్ణయం ప్రకారం..  ఆగస్టు 19 నుంచి 25 వరకు ఏపీ ఎంసెట్ పరీక్ష ఉండగా… సెప్టెంబర్ 17, 18న ఐసెట్ పరీక్షను నిర్వహిస్తున్నట్టు పేర్కొంది.

అలాగే సెప్టెంబర్ 19న ఈసెట్ పరీక్ష ఉండగా… నెంబర్ 21 న ఎడ్ సెట్ , సెప్టెంబర్ 22 న లాసెట్ నిర్వహించనుంది ప్రభుత్వం. అలాగే సెప్టెంబర్ 27 నుంచి అదే నెల 30 వరకు పీజీఈ-సెట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.

కరోనా మహమ్మారి కారణంగా అన్ని రకాల పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా కొన్ని రోజుల కిందనే ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షల ఫలితాలను కూడా త్వరలోనే ఏపీ సర్కార్ ప్రకటించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news