ప్రభాస్ అభిమానిని చితకబాదిన అల్లు అర్జున్ ఫ్యాన్స్!… మండిపడుతున్న నెటిజన్స్

-

సోషల్ మీడియా వేదికగా జరిగే ఫ్యాన్ వార్ ఇప్పుడు రోడ్లపైకి వచ్చేసింది.బెంగళూరులో రెబల్ స్టార్ ప్రభాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య ఫ్యాన్ వార్ జరిగినట్లుగా సోషల్ మీడియా లో ఓ వీడియో వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం.. మైదానంలో క్రికెట్ ఆడుతుండగా ప్రభాస్ ,అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభాస్ అభిమానిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ మూకుమ్మడిగా దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో ప్రభాస్ అభిమాని తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుతున్నారు.

ఇక అభిమాన సినీ హీరో కోసం ఓ వ్యక్తిపై ఇంత ద్వేషం పెంచుకుని కొట్టడం సరికాదని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ఇలాంటి దాడిలో మీరు గాయపడితే బాధపడేది మీ పేరెంట్సే. హీరోలంతా కలిసి బాగానే ఉంటారు. మరి ఫ్యాన్ వార్స్ ఎందుకు?’ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news