కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో పవన్ కల్యాణ్‌ భేటీ

-

మరికొన్ని రోజులలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పొత్తులలో భాగంగా కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. విజయవాడలో వీరిద్దరూ మర్యాదపూర్వకంగా కలిశారు.

తెలుగుదేశం పార్టీ , బీజేపీ,జనసెనా పొత్తు కుదిరిన నేపథ్యంలో ఇరు పార్టీలు పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలు కేటాయించినట్లు సమాచారం. ఇందులో బీజేపీకి 6 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాలు కేటాయించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news