అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్.. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్.. హ్యాష్ ట్యాగ్లతో మేకర్లకు చుక్కలు..

-

తెలుగు సినిమా అభిమానులు మామూలు వాళ్ళు కాదు. తమ అభిమాన హీరోని ఎంతగా ఆదరిస్తారో తెలిసిందే. హీరో సినిమా మొదలెట్టినప్పటి నుండి విడుదలయ్యే వరకూ వారి హంగామా కొనసాగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ గా అప్డేట్లు ఇవ్వాలని చూస్తుంటారు. అలా ఇవ్వని పక్షంలో సోషల్ మీడియా వేదికగా, చిత్ర నిర్మాతలకి చురకలు అంటించేలా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయడం చూస్తున్నాం. అప్పట్లో రాధేశ్యామ్ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ప్రభాస్ అభిమానులు ఎంత రచ్చ చేసారో చూసాం.

తాజాగా అలాంటి హ్యాష్ ట్యాగ్ గొడవే సోషల్ మీడియాలో మొదలైంది. ఈ సారి అల్లు అర్జున్ అభిమానులు అది ట్రెండ్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న పుష్ప సినిమా నుండి అప్డేట్ వచ్చి చాలా రోజులవుతున్న నేపథ్యంలో అప్డేట్ ఇవ్వాలంటూ #WakeUpMythriMovieMakers పేరుతో ట్రెండ్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత ఎలాంటి అప్డేట్ రాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. ఈ విషయమై నిర్మాతలు అంత సీరియస్ గా తీసుకోకపోయినప్పటికీ త్వరలోనే పుష్ప నుమ్డి ఏదో ఒక అప్డేట్ బయటకి తీసుకురావాలని చూస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news