ఢిల్లీ గురించి మాట్లాడి అమరావతిలో ఇరుక్కుపోయిన అల్లు అర్జున్…!

-

దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంలో జరిగిన హింస ఘటన ప్రభావం ఇప్పుడు సినిమా నటుల మీద పడుతుంది. బాలివుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే విద్యార్ధులకు మద్దతుగా వర్సిటీ కి వెళ్లడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె తుకడే తుకడే గ్యాంగ్ కి మద్దతు ఇచ్చారు అంటూ రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఆమె తీరు పై మండిపడుతున్నారు.

ఇక ఇప్పుడు ఈ సెగ అల్లు అర్జున్ కి కూడా తాకింది. వర్సిటిలో విద్యార్ధులపై దాడి సరికాదని జాతీయ మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేసారు. బన్ని తీరుపై ఏపీ విద్యార్థులు ఆగ్రహ౦ వ్యక్తం చేసారు. ఎక్కడో దేశ రాజధానిలో జరిగిన వివాదం గురించి మాట్లాడుతున్నావ్, మరి నీ సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో అమరావతి గురించి ఉద్యమం జరుగుతుంది,

ఎందుకు దానిపై స్పందించడం లేదని విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 19వరకు హీరోల ఇంటి వద్ద నిరసనలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఆయన ఇంటి ముందు ఆందోళన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు ఇంటి ముందు శుక్రవారం పలువురు విద్యార్ధులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రభావం అల్లు అర్జున్ సినిమాపై కూడా పడే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news