స్విగ్గీ, జొమాటోలకు షాక్‌.. త్వరలో అమెజాన్‌ ఫుడ్‌ డెలివరీ సేవలు..!

-

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ భారత్‌లో త్వరలో ఫుడ్‌ డెలివరీ సేవలను ప్రారంభించనుంది. మార్చి నెలలో ఈ సేవలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తుండగా, ఇప్పటికే బెంగళూరులోని పలు ఎంపిక చేసిన రెస్టారెంట్ల ద్వారా అమెజాన్‌ ఈ సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే అతి త్వరలో అమెజాన్‌ ఫుడ్‌ డెలివరీ సేవలు ప్రారంభం కానున్నాయి.

amazon to launch food delivery services in India soon

కాగా అమెజాన్‌ అందించనున్న ఫుడ్‌ డెలివరీ సేవలు ప్రైమ్‌తో బండిల్‌గా లభించనున్నాయి. అంటే అమెజాన్‌ ప్రైమ్‌ కస్టమర్లకు మరిన్ని బెనిఫిట్స్‌ ఉంటాయన్నమాట. ఇక ఈ విషయం స్విగ్గీ, జొమాటో సంస్థలను కలవర పెడుతోంది. ఇటీవలే ఊబర్‌ కంపెనీ తన ఊబర్‌ ఈట్స్‌ యాప్‌ను జొమాటోకు విక్రయించగా, ప్రస్తుతం మార్కెట్‌లో స్విగ్గీ, జొమాటోలే ముఖ్యమైన ఫుడ్‌ డెలివరీ యాప్‌లుగా కొనసాగుతున్నాయి. అయితే అమెజాన్‌ ఫుడ్‌ డెలివరీ సర్వీస్‌ వస్తే ఈ రెండు కంపెనీలకు గడ్డు కాలం వస్తుందనే చెప్పవచ్చు.

కాగా అమెజాన్‌ ఫుడ్‌ డెలివరీ సేవలు నిజానికి గతేడాది దీపావళి సమయంలోనే ప్రారంభం కావల్సి ఉంది. కానీ పలు సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయింది. అయితే ఎట్టకేలకు మార్చి నెలలో ఆ సేవలు అందుబాటులోకి వస్తాయని అమెజాన్‌ సంస్థ ప్రతినిధి ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ క్రమంలో అమెజాన్‌ ఫుడ్‌ డెలివరీ సర్వీస్‌ అందుబాటులోకి వస్తే.. స్విగ్గీ, జొమాటోలు ఆ పోటీని తట్టుకుని నిలబడతాయా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది..!

Read more RELATED
Recommended to you

Latest news