బిజెపి దేశంలో పెద్ద పార్టీ కావచ్చు..కానీ ఏపీలో మాత్రం తుస్సే: అంబటి రాంబాబు

-

ఆత్మకూరు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆదివారం నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం లో వైసీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీ దేశంలో పెద్ద పార్టీ అయితే అయ్యుండొచ్చు.. కానీ రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ తుస్సే అని ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో టిడిపి బరిలో లేదు కాబట్టే బీజేపీ నేతలు కనిపిస్తున్నారని విమర్శించారు.

అసలు వారి సైజ్ ఎంత? వారి వారికి వచ్చిన ఓట్ల శాతం ఎంత? ప్రచారం పొందాలన్న ఉబలాటంతోనే తనను ఏదో ఒకటి అంటున్నారు అని అంబటి అన్నారు. ప్రజా ధనంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా అన్ని పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామన్నారు. మరో మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీకి లక్ష ఓట్ల మెజారిటీ వచ్చేలా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించాలని కార్యకర్తలకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news