లోకేష్, ఎక్కడయినా గెలిచి సవాల్ చెయ్ : అంబటి

-

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. తాను,తన కుటుంబానికి హత్యకు ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేస్తానని, అలా జగన్ చేయగలడా ? అని లోకేష్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. దాని మీద అంబటి రాంబాబు స్పందించారు. సవాల్ చేస్తే నాయకులు అవుతారా ? అని ప్రశ్నించిన ఆయన లోకేష్ ఎక్కడయినా గెలిచి సవాల్ చేయాలని సూచించారు.

ambati-rambabu
ambati-rambabu

తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అని పేర్కొన్న ఆయన టీడీపీ ఉనికే ప్రమాదంలో పడిందని అన్నారు. ఓటమి భయంతోనే లోకేష్ జగన్ మీద విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు, లోకేష్ లను ప్రజలు ఎప్పుడో తరిమికొట్టారన్న ఆయన బాబు, లోకేష్ లు వీధుల్లో తిరుగుతున్నా జనం రావడం లేదని అన్నారు. వివేకా హత్య మీద బీజేపీ, అమిత్ షాను మాత్రమే ప్రశ్నించాలని అన్నారు. లోకేష్ సవాల్ చేస్తే నాయకుడు అవ్వరు, గెలిస్తే అవుతారని అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news