లోకేష్ ఆ ఒక్క కామెంట్ తో బాగా హైలెట్ అయ్యారా…?

-

తిరుపతి పార్లమెంటు పరిధిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న ప్రచారం ఇప్పుడు అధికార పార్టీని బాగా ఇబ్బంది పెడుతోంది అనే విషయం అందరికీ అర్థమవుతుంది. కొన్ని కొన్ని అంశాల్లో అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విషయంలో నారా లోకేష్ దాదాపుగా విజయవంతం అవుతున్నారు. తాజాగా వైయస్ వివేకానంద రెడ్డి మరణానికి సంబంధించి నారా లోకేష్ అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా చేసిన విమర్శ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

వైఎస్ వివేకానందరెడ్డి మరణానికి అలాగే తమ కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదు అని ఈ విషయంలో తాము ప్రమాణం చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చే ప్రమాణం చేయాలి అంటూ చేసిన సవాల్ కు అందరు కూడా ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకు కూడా నారా లోకేష్ ఈ స్థాయిలో అధికార పార్టీని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఏమీ లేదు.

కానీ తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో వైయస్ వివేకానంద రెడ్డి మరణాన్ని అలాగే ఎంపీల పనితీరుని ప్రధానంగా ఆయన హైలెట్ చేస్తున్నారు. దీంతో అధికార పార్టీ నేతలు పైకి చెప్పుకోలేని విధంగా ఇబ్బంది పడుతున్నారనే అభిప్రాయం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచారం చేయడానికి ప్రధాన కారణం నారా లోకేష్ అనే భావన కూడా చాలామందిలో వ్యక్తమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news