బీజేపీ బోర్‌ కొట్టి..ఇప్పుడు TDP లోకి పవన్‌ వస్తున్నాడు – అంబటి రాంబాబు

-

బీజేపీ బోర్‌ కొట్టి..ఇప్పుడు TDP లోకి పవన్‌ వస్తున్నాడని ఏపీ ఇరిగేషన్‌ శాఖ మంత్రి వర్యులు అంబటి రాంబాబు విమర్శలు చేశారు. బి.జె.పి..జన సేన కూటమి అంటారని.. బి.జె.పి.తో పొత్తు ఉందంటారని పేర్కొన్నారు. ఆత్మకూరు ఎన్నికల్లో మాత్రం కనపడరని… ఉప ఎన్నికల పై ఆ పార్టీకి ఓటు వేయమని అడగరని ఎద్దేవా చేశారు.

పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్‌ తన వైఖరి ఎంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు అంబటి రాంబాబు. బి.జె.పి.ని వదిలి తెలుగు దేశం తో వెళ్లాలనుకుంటున్నారని.. ఆ విషయాన్ని స్పష్టం చేయాలని పేర్కొన్నారు.

చంద్రబాబు కోసమే పవన్ పని చేస్తున్నారని.. పవన్ కళ్యాణ్‌ సమాధానం చెప్పాలని వెల్లడించారు ఏపీ ఇరిగేషన్‌ శాఖ మంత్రి వర్యులు అంబటి రాంబాబు. వైసీపీ పార్టీతోనే.. ఏపీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఏపీ ప్రజలు ఎప్పుడూ.. జగన్‌ సర్కార్‌ వెంబడే ఉంటారని స్పష్టం చేశారు అంబటి రాంబాబు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news