చైనా విషయంలో ఇండియాకు అమెరికా వార్నింగ్…!

-

అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో… మంగళవారం టోక్యోలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ ను కలిశారు. ఈ సందర్భంగా ఇండో-పసిఫిక్ మరియు ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి, శాంతి, శ్రేయస్సు మరియు భద్రత కోసం కలిసి పనిచేయవలసిన అవసరాన్ని ఆయన స్పష్టం చేసారు. ఇక ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. వాస్తవ నియంత్రణ రేఖ వెంట చైనా 60,000 మందికి పైగా సైనికులను మోహరించింది అని ఆయన పేర్కొన్నారు.

చైనీయులు ఇప్పుడు ఉత్తరాన భారతదేశానికి వ్యతిరేకంగా భారీ సైన్యాన్ని మోహరిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్, దక్షిణ చైనా సముద్రంలో మరియు తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఐసి) వెంట చైనా దూకుడుపై భారత్, అమెరికా మధ్య చర్చ జరిగింది. ఆస్ట్రేలియా, జపాన్ సహా పలు దేశాల విదేశాంగ శాఖా మంత్రులతో సమావేశం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news