నేడు తెలంగాణకు అమిత్ షా.. షెడ్యూల్ ఇదే

-

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీలు ప్రచారం ఉద్ధృతం చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఆయా పార్టీల అధినేతలు, కీలక నేతలు ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ నేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు.

ఈరోజు మధ్యాహ్నం సిద్దిపేటలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఆయన మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న షా.. గం.11.45 నిమిషాలకు సిద్దిపేట చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలో బహిరంగ సభలో పాల్గొననున్నారు.ఆ తర్వాత మధ్యాహ్నం 1.45 గంటలకు తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. భోజన విరామం అనంతరం 2.15 గంటలకు బేగంపేట నుంచి భువనేశ్వర్‌కు బయలుదేరుతారు.

Read more RELATED
Recommended to you

Latest news