ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్న అమృత్ పాల్ సింగ్

-

జైల్ నుంచే ఎంపీగా నామినేషన్ వేసి.. ఒక్క రోజు ప్రచారం చేయకుండానే ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచారు. పంజాబ్ ఏర్పాటు వాది అయిన అమృత్ పాల్ సింగ్ ప్రత్యేక పంజాబ్ దేశం కావాలని పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

 

పంజాబ్ లోని ఖదూర్ సాహిబ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి అమృత్ పాల్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జిరాపై లక్షా 97వేల 120 ఓట్ల తేడాతో గెలిచాడు. అయితే అమృత్ పాల్ ప్రస్తుతం అసోంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్నాడు.4 రోజుల పెరోల్ బెయిల్ పై వచ్చి ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన మద్దతుదారులు ఆయా వివరాలు అందించారు. జూలై 5న అమృత్ పాల్ సింగ్ ఎంపీగా లోక్ సభలో ప్రమాణస్వీకారం చేయనున్నాడు. వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను 2023లో పంజాబ్ ఏర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాడని పోలీసులు అరెస్ట్ చేశారు. కఠినమైన జాతీయ భద్రతా చట్టంతో అభియోగాలు మోపారు. ప్రస్తుతం అసోంలోని దిబ్రూగఢ్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే జైలులో అమృత్ పాల్ సింగ్ ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news