RadheShyam : రాధే శ్యామ్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ప్రభాస్ ఫాన్స్ కు ఇక పండగే

-

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యాం. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ సినిమా… టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా… యువి క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కుతోంది.  1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రభాస్‌ టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే జంటగా న‌టిస్తుంది.

భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా ను ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చేసింది. రేపు ఉదయం 11 గంటల సమయంలో ఈ సినిమా నుంచి ఓ బిగ్గెస్ట్ సప్రైస్… రాబోతున్నట్లు యూవి క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ పెట్టింది యు.వి.క్రియేషన్స్ సంస్థ. అయితే రేపు సెకండ్ సింగిల్ అప్డేట్ వస్తుందా ? లేక మరేదైనా అప్డేట్ ఇస్తుందా అనే సందేహం అందరిలోనూ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news