Anantapur :ఐదుగురు సిట్టింగ్‌లు ఔట్..! అనంతపురం జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా సిద్ధం..!

-

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ కీలక మార్పులు చేస్తున్నారు .అందులో భాగంగా అనంతపురం జిల్లాలో చేసిన కొన్ని మార్పులు తీవ్ర అలజడి రేపాయి. అనంతపురం జిల్లాలో 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వేటు పడినట్లు సమాచారం. ఎమ్మెల్యేలుజొన్నలగడ్డ పద్మావతి, శంకర్ నారాయణ,కాపు రామచంద్రారెడ్డి, సిద్ధారెడ్డి, తిప్పేస్వామి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తున్నట్లు సమాచారం అందుతోంది. స్త్రీ ,శిశు ,సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ను పెనుగొండకు మార్చనున్నారని తెలుస్తోంది.

 

శింగనమల నియోజకవర్గము సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కష్టంగానే ఉందని సమాచారం.

* రాయదుర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్లేస్ లో మెట్టు గోవింద రెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తుంది.

* కల్యాణదుర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ని పెనుగొండకు మారుస్తున్నారని సమాచారం.

* పెనుగొండ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నారాయణను పూర్తిగా తప్పించి, అనంతపురం ఎంపీగా పంపే అవకాశం సమాచారం. శంకర్ నారాయణ స్థానంలో ఉషశ్రీ చరణ్ నియమిస్తున్నట్లు సమాచారం.

* మడకశిర సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామి కి టికెట్ లేదని సమాచారం.

* కదిరి సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కి కూడా టికెట్ కష్టంగానే ఉన్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news