యాంకర్ రష్మీ చేతిలో ఘోరంగా అవమానపడ్డ అనసూయ.. ఏమైందంటే..?

-

జబర్దస్త్ వేదికగా స్టార్ స్టేటస్ అందుకున్న యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె జబర్దస్త్ అలాగే మల్లెమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బల్లగుద్ది మరీ చెప్పేసింది. ఈరోజు తను ఇలా ఉన్నప్పటికీ అదంతా మల్లెమల వల్లే సాధ్యమైందని పరోక్షంగా అనసూయకి కౌంటర్ ఇచ్చింది. గతంలో చాలాసార్లు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయి.. మళ్ళీ రీఎంట్రీ చేస్తూ హడావిడి చేసింది అనసూయ. ఇలా రెండు మూడు సార్లు చేయడం జరిగింది. కానీ రష్మీ గౌతం మాత్రం జబర్దస్త్ యాంకర్ గా కంటిన్యూ అవుతుంది.

సినిమాలలో అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వాటిని చేస్తూనే జబర్దస్త్ లో కూడా కంటిన్యూ అవుతుంది. కానీ అనసూయ మాత్రం వరుస సినిమాల్లో బిజీగా ఉండడంతో పాటు స్టార్ మా లో ఎక్కువ పారితోషకం కోసం షిఫ్ట్ అయిపోవడం కూడా చూసాము. ఇప్పుడు ఈ విషయంపై రష్మీ గౌతమ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు నేరుగా అనసూయ క్యారెక్టర్ ను దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు నెటిజన్లు వాపోతున్నారు. జబర్దస్త్ తొలి యాంకర్ గా అనసూయ వ్యవహరించారు. అంతేకాదు ఆ షో సక్సెస్ వెనుక అనసూయ చేయి బలంగా ఉంది. అలాగే జబర్దస్త్ మూల స్తంభాలలో ఒకరైన నాగబాబు, రోజా, అనసూయ ఇప్పుడు ముగ్గురు దూరం అవ్వడం ఒకరకంగా చెప్పాలంటే మల్లెమాలకు పెద్ద నష్టం అని చెప్పాలి.

అయితే ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేసి అనసూయను టార్గెట్ చేసింది అంటూ అభిమానులు వాపోతున్నారు అంతేకాదు తాను ఎక్కడికి వెళ్ళినా జబర్దస్త్ మాత్రం వదిలేయలేదు అని చెప్పింది అంతేకాదు సుడిగాలి సుదీర్ విషయంలో కూడా ఆమె మాట్లాడింది కొందరు కేవలం డబ్బు కోసమే వదిలి వెళ్తున్నామని చెప్పడం చాలా పెద్ద జోక్ అయితే త్వరలో సుడిగాలి సుదీర్ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇస్తాడు అని ఆమె తెలిపింది మొత్తానికైతే ఈ వార్తలు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news