నా బాధ వినండి ప్లీజ్ : కేటీఆర్ కు రష్మీ రిక్వెస్ట్

-

యాంకర్ రష్మీ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. బుల్లితెర యాంకర్ గానే కాదు అవకాశాలు వచ్చినప్పుడల్లా సినిమాల్లో కూడా నటిస్తుంది ఈ భామ. కరెంట్, గుంటూరు టాకీస్ మొదలగు చిత్రాలలో నటించి మంచి పేరును తెచ్చుకుంది. ఈ క్రమంలోనే యూత్‌లో కూడా ఈ జ‌బ‌ర్దస్త్ బ్యూటీకి బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. యాంకర్‌గా, యాక్టర్‌గా ఫుల్ బిజీగా ఉన్న రష్మీ గౌతమ్.. భారీ స్థాయిలో పాపులారిటీని దక్కించుకోవడం వెనుక జబర్ధస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ కూడా కారణమే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే.. తాజాగా రష్మి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఓ విషయం పై విజ్ఞప్తి చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కుక్కలకు ఏబీసీ అంటే యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ ఆపరేషన్‌ చేసి అలాగే వదిలేస్తున్నారని… దీనికి ఏదైనా పరిష్కార చర్యలు తీసుకోవాలని రష్మి మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్‌ వేదికగా కోరింది. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ వ్యక్తిగత ఖాతాతో పాటు కేటీఆర్‌ కార్యాలయ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ ఓ ట్వీట్‌ చేసింది రష్మి. అయితే.. దీనిపై మంత్రి కేటీఆర్‌ ఇంకా స్పందించలేదు. అటు రష్మిది ఎంత గొప్ప మనసు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news