షర్మిలను కలుసుకున్న యాంకర్ శ్యామల..

-

2019 ఎలక్షన్లలో వైయస్సార్సీపీ పార్టీలో జాయిన్ అయిన యాంకర్ శ్యామల, ఆ తర్వాత కొన్ని చోట్ల ప్రచారానికి కూడా వెళ్ళింది. ఐతే ప్రస్తుతం శ్యామల తన మనసు మార్చుకుందేమో అనిపిస్తుంది. దానికి కారణం వైయస్ షర్మిలని కలుసుకోవడమే అనిపిస్తుంది. తెలంగాణ రాజకీయ వర్గాల్లో షర్మిల పార్టీ పెడుతుందన్న వార్త సంచలనం రేగిన సంగతి తెలిసిందే. పార్టీ పెట్టడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఇప్పటికే జిల్లాల ప్రజలతో మాట్లాడుతున్నారు.

ఐతే తాజాగా యాంకర్ శ్యామల్, తన భర్త నరసింహారెడ్డి షర్మిలని కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వైయస్సార్సీపీలో ఉన్న వారిద్దరూ షర్మిల పార్టీలోకి జాయిన్ అవుతున్నారా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. లోటస్ పాండ్ లో షర్మిలని కలుసుకున్న శ్యామలా దంపతులు, 15నిమిషాల పాటు చర్చలు జరిపారట. అవేంటనేది ఎవరికీ తెలియదు. కొన్ని రోజుల క్రితమే బ్రదర్ అనిల్ పుట్టినరోజున శ్యామలా దంపతులు విషెస్ తెలియజేసారు.

Read more RELATED
Recommended to you

Latest news