తిరుపతి లో బయటపడ్డ పురాతన శాసనం.. ఏ కాలం నాటిదో తెలుసా..?

-

తిరుమల శ్రీవారి తల్లిగా పూజలు అందుకునే వకుళమాత ఆలయంలో చారిత్రక శాసనం ఒకటి బయట పడింది. తిరుపతి సమీపంలోని పేరూరు గ్రామంలో వకుళమాత ఆలయ అభివృద్ధి పనుల్లో ఈ పురాతన శాసనం వెలుగు చూసింది. ఈ శాసనాన్ని పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు 11వ శతాబ్దంలో తమిళంలో నాటి చోళ రోజు మొదటి కులోత్తంగ చోళుడు జారీ చేసిన శాసనంగా గుర్తించారు.ఈ శాసనం ఆధారంగా ఇక్కడే విష్ణుమూర్తి అలయంతో పాటు, అమ్మవారి ఆలయం ఉన్నట్లు చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వకుళమాత ఆలయానికి సంబంధించి..గతంలో శాసన ఆధారాలు దొరకని పక్షంలో… ఈ శాసనంపై పురావస్తు శాఖ అధికారులు మరింత లోతుగా పరిశోధనలు జరుపుతున్నారు.

Tirupathi
Tirupathi

తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే దేశం మొత్తం ప్రాచుర్యం పొందింది. అతి పురాతన గుడి గా, కలియుగంలో అత్యంత సంపన్నుడిగా పేరొందిన శ్రీవారి గుడి చుట్టూ ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి గా నిపుణులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news