Andhra Pradesh :నాలుగవ జాబితాపై కొనసాగుతున్న కసరత్తు…

-

ఇప్పటికే మూడు జాబితలు విడుదల చేసిన వైసిపి అధిష్టానం నాలుగవ జాబితా కోసం తుది కసరత్తు ప్రారంభించింది. ఇదిలా ఉంటే దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, నేతలు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే పలు లోక్ సభ , అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జీల మార్పులతో నాలుగో జాబితాను సిద్దం చేస్తున్నారు.

 

ఇక, సీఎంవోకు మంత్రి అంబటి రాంబాబుతో పాటు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు,శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి వచ్చారు. అలాగే, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాల పార్టీ ఇన్ చార్జీల మార్పుల నేపథ్యంలో హుటాహుటినా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవ్ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కనిగిరి నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జి మార్పుపై చర్చిస్తున్నారు. నాలుగవ జాబితాలో ఏకంగా తొమ్మిది మంది ఎంపీ అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. నాలుగో జాబితాలో నర్సరావుపేట, గుంటూరు, బాపట్ల, కడప, రాజంపేట, ఒంగోలు ,మచిలీపట్నం, రాజమండ్రి, కాకినాడ, పార్లమెంట్ అభ్యర్దులను సీఎం జగన్ ప్రకటించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news