AP: జగన్ మంత్రి వర్గంలో కొనసాగే మంత్రులు వీరే…!

-

ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ కూర్పు చివరి దశకు వచ్చింది. ఈ రోజు సాయంత్రానికి కల్లా సస్పెన్స్ కు తెరపడే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రి వర్గానికి సంబంధించిన పేర్లు గవర్నర్ కార్యాలయానికి చేరాయి. మరోవైపు మంత్రుల రాజీనామాలను కూడా గవర్నర్ ఆమోదించనున్నారు. సామాజిక అంశాలు, అనుభవం, జిల్లాల ప్రాతినిథ్యం ప్రాతిపాదికగా కొత్త మంత్రి వర్గం కూర్పు ఉండనుంది. నిన్న దాదాపు 3 గంటల పాటు సీఎం జగన్ తో సమావేశం అయిన ప్రభుత్వ సలహాదారుడు సజ్జల మంత్రివర్గం కూర్పు ఫైనలైజ్ చేశారు. ఇప్పటికే కొత్తగా మంత్రులుగా ఎన్నిక అవబోతున్న వారికి సీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. 

జగన్ మంత్రి వర్గంలోని పాత మంత్రి వర్గంలోని 10 మంది కొనసాగే అవకాశం ఉండగా… కొత్తగా 15 మందికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. కొనసాగే మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాథ్, కొడాలి నాని, గుమ్మనూరు జయరాం, సిదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్ ఉండనున్నట్లు సమాచారం కొత్త మంత్రి వర్గంలో ఇద్దరు ఎస్టీలు, ఇద్దరు మైనారిటీలతో  పాటు 6 మంది ఎస్సీలు ఉంటారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news