ఏపీ అసెంబ్లీ నుంచి 12 మంది టిడిపి సభ్యుల సస్పెన్షన్

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు వాడి వేడిగా సాగుతున్నాయి. శాసనసభ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నర్ ను స్పీకర్ చాంబర్ లో వెయిట్ చేయించారని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఆహ్వానం పలకాల్సిన సీఎం జగన్ ఆలస్యంగా వచ్చిన కారణంగానే గవర్నర్ ను వెయిట్ చేయించారని ఆయన ఆరోపించారు.

దీంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆరోపణలు చేసిన కారణంగా 12 మంది టిడిపి సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వీరి సస్పెన్షన్ అమల్లో ఉంటుందని స్పీకర్ పేర్కొన్నారు. గవర్నర్ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే స్పీకర్ తీరుకు వ్యతిరేకంగా టిడిపి సభ్యులు నినాదాలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news