ఏపీ కరోనా అప్డేట్ : కొత్తగా 1,361 కేసులు

-

కరోనా మహమ్మారి ఆంధ్ర ప్రదేశ్‌ ను వదలడం లేదు. ఆంధ్ర ప్రదేశ్‌ లో మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు.. ఇప్పుడు పెరిగిపోతున్నాయి. తాజాగా నిన్నటి కంటే ఈ రోజు కాస్త పెరిగాయి కరోనా కేసులు. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1361 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,24,603 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధిలో మరో 15 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13, 950 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14, 510 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1288 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 61, 363 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,70, 99, 0314 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,96, 143 లక్షలకు చేరింది.

 

Read more RELATED
Recommended to you

Latest news